మసీదుల మరమ్మతుల కోసం చెక్కులు
NEWS Oct 15,2024 08:03 am
ఖమ్మం నియోజకవర్గంలోని అన్ని మసీదుల మరమ్మతుల కోసం ముస్లిం మత పెద్దలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెక్కులను పంపిణీ చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో మంత్రికి ముస్లిం మత పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.