ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల వినతి
NEWS Oct 15,2024 07:54 am
మణుగూరు తహశీల్దార్ రాఘవరెడ్డికి మండల వర్కింగ్ జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని తహశీల్దార్ను జర్నలిస్టులు కోరారు. దీనిపై తహశీల్దార్ సానుకూలంగా స్పందించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.