పల్లెపండుగతో గ్రామాలకు మహర్దశ: MLA
NEWS Oct 15,2024 06:40 am
NREGS నిధులతో నిర్మించిన ఈ రహదారులను మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం ప్రారంభించారు. పొందుగల గ్రామంలో 865 మీటర్ల పొడవునా 4 రహదారుల నిర్మాణానికి రూ.39 లక్షలు వెచ్చించి పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లెపండుగ కార్యక్రమంతో గ్రామాలకు మహర్దశ పట్టుకుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చురుగ్గా సేవలందిస్తున్న స్థానిక నాయకులను ప్రత్యేకంగా అభినందించారు.