కొత్తగూడెంలో క్రీడా అవగాహన ర్యాలీ
NEWS Oct 15,2024 06:37 am
కొత్తగూడెం: త్వరలో నిర్వహించే సీఎం కప్ క్రీడలను పురస్కరించుకొని క్రీడా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ, అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రారంభించారు. క్రీడల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే ఆదినారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.