అసంపూర్తిగా మిగిలిన సచివాలయ భవనం
NEWS Oct 15,2024 06:20 am
ఇబ్రహీంపట్నం రైతు బజార్ వెనుక నిర్మించ తలపెట్టిన సచివాలయ భవనం అసంపూర్తిగా నిలిచిపోవడంతో అసాంఘిక శక్తులకు అడ్డగా మారిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల నుండి కురుస్తున్న వర్షాలకు రైతు బజార్ వెనుక పూర్తిగా బురద చేరడంతో రైతు బజార్ కి వెళ్లే వినియోగదారులకు కూడా తలనొప్పిగా మారింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ భవనంను పూర్తిస్థాయిలో నిర్మాణం అయినా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.