మురికి కాలువల పూడికతీత చేపట్టండి
NEWS Oct 15,2024 06:20 am
టేక్మాల్ మండలం కాదులూరు గ్రామంలో ఎస్సి కాలనీలో మురికి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. కాలనీలో సుమారు 2 నెలలుగా గ్రామ పంచాయతీ అధికారులు మురికి కాలువల పూడికతీత పనులు చేపట్టాపోవడంతో మురికి కాలువలలో చెత్త, పిచ్చి మొక్కలతో నిండి దుర్వాసన వెదజల్లుతుందని కాలనీ ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి మురికి కాలువల పూడికతీత పనులు చేపట్టాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు