యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పత్రాలు అందజేత
NEWS Oct 15,2024 05:34 am
మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామపంచాయతిలో పనిచేస్తున్న సిబ్బందికి ఎంపీడీవో రామకృష్ణ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బాండ్లను అందజేశారు. పనులు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, బూట్లు, క్లౌజులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రవి, కారోబార్ రాములు, సిబ్బంది నర్సయ్య, సాహెబ్, శ్రీనివాస్, చిన్ననర్సయ్య తదితరులు పాల్గొన్నారు.