అధ్వానంగా ముస్లింల స్థితిగతులు: యాకూబ్
NEWS Oct 15,2024 05:36 am
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేలో చేపట్టనున్న సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ కుల సర్వేలో ముస్లిం మైనార్టీలను చేర్చాలని మైనార్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాకుబ్ పాషా ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీల కంటే ముస్లింల స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయని, దీనిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ విషయం గతంలోనే కొన్ని సర్వేలు ధ్రువీకరించాయని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నామన్నారు.