మేడిపల్లి: పోస్టర్లను తొలగించిన పోలీసులు
NEWS Oct 15,2024 04:52 am
మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలోని పలు చోట్లలో గోడలపై ఆదివారం రాత్రి మంత్రగాళ్లను ఒక్కొక్కరిని చంపబోతున్నాం.. అంటూ ఉన్న పోస్టర్లను పోలీసులు తొలగించారు. గుర్తు తెలియని వ్యక్తులు అంటించిన ఈ పోస్టర్లతో భయాందోళనలకు గురైన గ్రామ ప్రజలు పోలీసులకు పిర్యాదు చేసారు. పోస్టర్లు ఎవరు అంటించారనే కోణంలో మేడిపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.