గద్దర్ అవార్డుల కమిటీ తొలి మీటింగ్
NEWS Oct 15,2024 04:19 am
తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచస్థాయికి ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. డిప్యూటీ సీఎం అధ్యక్షతన గద్దర్ అవార్డుల కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు కమిటీ సభ్యులు నర్సింగరావు, తనికెళ్ల భరణి, సురేశ్బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరీశ్ శంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాని శ్రీధర్, గద్దర్ కూతురు గుమ్మడి విమల పాల్గొన్నారు. గద్దర్ అవార్డుల విధివిధానాలపై చర్చించారు.