యాంటీ డ్రగ్స్ సభ్యునిగా కే జగదీశ్వర్
NEWS Oct 15,2024 04:05 am
ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో యాంటీ డ్రగ్స్ మాదకద్రవ్య నిరోధక శాఖలో సభ్యునిగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ప్రజాపక్షం పాత్రికేయుడు కే. జగదీశ్వర్ను నియమించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ.. తన నియమకానికి ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల సీనియర్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్, పేరెంట్స్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.