కట్లకుంటలో మంత్రగాళ్లకు హెచ్చరిక లేఖ
NEWS Oct 14,2024 03:43 pm
మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో మంత్రగాళ్లను హెచ్చరిస్తూ వెలిసిన పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. గ్రామ కూడలిలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ అతికించారు. మా సంస్థకు అనేక ఫిర్యాదులు అందిన ఆధారంగా ఒక్కొక్కరిని చంపబోతున్నామని, ముందుగా గచ్చునూతి వద్ద గల ఇద్దరితో మొదలు పెట్టి ఇతర వీధులలో ఉన్నవారిని హతమార్చుతామని హెచ్చరించారు. చివర్లో మాత్రం ప్రజల మంచికోరే సంస్థ అని ఉంది.