అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS Oct 14,2024 12:29 pm
5 రూపాయలకే పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్ పథకంను చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం మడకశిరలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుంచిట్టిగా వక్కలిగా సాధికార సమితి కన్వీనర్ పాండురంగప్ప, మడకశిర మండలాల కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జిలు, తదితరులు పాల్గొన్నారు.