ప్రజావాణిలో 22 ఫిర్యాదులు
NEWS Oct 14,2024 10:26 am
జగిత్యాల: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ఈ రోజు 22 ఫిర్యాదులు వచ్చినట్టు అదనపు కలెక్టర్ పి.రాంబాబు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలతో వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.