జగిత్యాల జిల్లాలో డిగ్రీ కళాశాలల బంద్
NEWS Oct 14,2024 09:58 am
రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో పూర్తిగా ఈ పథకంతో నడిచే రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలు ఆర్థిక ఇబ్బందుల్లో వున్నాయని, జీతాల చెల్లింపు, భవనాల అద్దెలు, వడ్డీల చెల్లింపు, నిర్వహణ కూడా కష్టంగా వుందని తమకు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని అధికారులు, మంత్రులు అందరినీ కలిసి ఎన్నిసార్లు అడిగినా కనీస స్పందన లేదని అన్నారు. నిరసనగా జగిత్యాలలో బంద్ విజయవంతం చేశామని తెలిపారు.