రాజమండ్రిలో ఈవెంట్ యాంకర్ కావ్యశ్రీ, ఆమె తండ్రిపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అనుచరుడు దాడికి పాల్పడ్డాడు. నల్లూరి శ్రీనివాస్, ఆయన కుమారుడు అభిషేక్ 2021లో యాంకర్ కావ్యశ్రీ వద్ద రూ. 3 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పును తీర్చమని అడిగినందుకు తాజాగా కావ్యశ్రీ, ఆమె తండ్రి నాగరాజుపై శ్రీనివాస్ దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు దాఖలైంది. ఈ మేరకు కావ్యశ్రీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.