ఆటోకు నిప్పు పెట్టిన దుండగులు
NEWS Oct 14,2024 09:06 am
టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామంలో ఆదివారం అర్థ రాత్రి గుర్తుతెలియని దుండగులు ఆటోకు నిప్పు పెట్టి తగలబెట్టారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోటగిరి వెంకట్ అనే వ్యక్తి అటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంటి ముందు ఆటోను పార్కింగ్ చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆటోకు నిప్పు పెట్టి తగలబెట్టారని గ్రామ ప్రజలు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.