మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు
NEWS Oct 14,2024 07:06 am
సికింద్రాబాద్ కమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో గతరాత్రి అమ్మవారి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఉదయం ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. విగ్రహం ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండించారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.