హోటల్ సీజ్ చేసిన అధికారులు
NEWS Oct 14,2024 06:31 am
జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా సమీపంలోని గణేష్ భవన్ ఉడిపి హోటల్లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తనిఖీ చేశారు. నిన్న ఉదయం ఓ మహిళా కస్టమర్ ఇడ్లిలో జెర్రీ కనిపించగా ఆమె ఉడిపి హోటల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. ఈ రోజు ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తనిఖీలు నిర్వహించి హోటలను సీజ్ చేశారు.