దుర్గామాత ఉత్సవాల్లో GMR చైర్మన్
NEWS Oct 13,2024 05:59 pm
SRD: నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామంలో దేవి శరన్నవ రాత్రి ఉత్సవాల్లో ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు దుర్గా మాత ఊరేగింపు కార్యక్రమంలో GMR ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు మచ్చేందర్ని ఆహ్వానించి, సన్మానం చేశారు. వారితో పాటు GMR ఫౌండేషన్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ అనుముల మారుతీ, కిష్టపూర్ తాజా మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, గుఱ్ఱపు శ్రీనివాస్ పాల్గొన్నారు.