పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS Oct 13,2024 04:10 pm
మెట్పల్లి మండలం ఆరపేట ప్రాథమిక పాఠశాలలో 2004-05లో 7వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒకేచోట చేరి నాటి మధుర జ్ఞాపకాలను, చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యనందించిన గురువులను శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందించారు. కార్యక్రమంలో పూర్వ హెడ్ మాస్టర్ విశ్వనాథం, టీచర్లు రాజగంగారం, రాజన్న, రాజు తదితరులున్నారు.