ఆలయ అధికారికి మెమో జారీ
NEWS Oct 13,2024 03:05 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోని నిత్య అన్నదాన సత్రంలో దొంగతనం జరిగినట్లు గుర్తించారు అధికారులు. సీసీ ఫుటేజ్ను పరిశీలించగా నిత్యాన్నదాన సత్రంలోని బియ్యం బస్తాలు, ఇతర సామాగ్రి దొంగతనం జరిగినట్టు గుర్తించామని, ఈ దొంగతనానికి పాల్పడింది అన్నదాన సత్రం ఇన్చార్జి రాములు అని అధికారులు తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారికి ఆలయ AEO ఆంజనేయులు మెమో జారీ చేసి, విచారణకు ఆదేశించామని, నివేదిక అనంతరం శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.