సత్తుపల్లిలో RSS ఆధ్వర్యంలో పదసంచలనం
NEWS Oct 13,2024 03:04 pm
RSS స్థాపించి 99 ఏళ్లు పూర్తయి 100వ సంవత్సరంలో అడుగు అడుగుపెట్టింది. ఆదివారం విజయదశమి సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో కనుల విందుగా RSS కార్యకర్తలు పద సంచలనం కార్యక్రమం చేపట్టారు. 300 మందికి పైగా స్వయం సేవకులు పాల్గొని సత్తుపల్లి పురవీధుల్లో పద సంచలనం నిర్వహించారు. దేశ ప్రజల్లో దేశభక్తి నింపుతూ ఏ విపత్తు వచ్చినా ఆర్ఎస్ఎస్ ముందుండి అన్నీ సహాయ సహకారాలు అందిస్తుందని కావడి రమేష్ తెలిపారు.