కల్యాణ్ జ్యుయెలర్స్ యజమాని ఇంట
నవరాత్రి వేడుకల్లో చిరు, నాగ్
NEWS Oct 13,2024 02:22 pm
కల్యాణ్ జ్యుయెలర్స్ సంస్థ యజమాని టీఎస్ కల్యాణరామన్ ఇంట దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కేరళలోని త్రిసూర్లో జరిగిన ఈ శరన్నవరాత్రి సంబరాల్లో చిరంజీవి, నాగార్జున పాల్గొన్నారు. కల్యాణ్ జ్యుయెలర్స్ ఎండీ టీఎస్ కల్యాణరామన్ ఆహ్వానం మేరకు చిరంజీవి, నాగార్జున ప్రత్యేక విమానంలో త్రిసూర్ వెళ్లారు.