అశ్వాపురం మొండికుంట అటవీ ప్రాంతంలోని ఎర్రమ్మ గుడి ప్రాంతం గుంతలతో ప్రమాదాలకు నిలయంగా మారాయని స్థానికులు చెప్పారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గతంలో వాహనదారుల ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులను రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కాగా అధికారులు నామమాత్రంగా ఆ గుంతల్లో మట్టి వేసి చేతుల దులుపుకుంటున్నారని అన్నారు.