జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ నిత్య అన్నదాన సత్రంలో అవకతవకాలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై విచారణ ప్రారంభమైంది. నిత్యాన్నదాన సత్రంలో బియ్యం దొంగతనం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సత్రం ఇన్చార్జి రాములు. CC కెమెరాల ఆధారంగా గుర్తించి రాములును విచారణ చేపట్టినట్లు ఆలయ AEO అంజయ్య తెలిపారు. విచారణ అనంతరం శాఖ పరమైన చర్యలు ఉంటాయని AEO తెలిపారు.