బోల్తా కొట్టిన వాహనం వ్యక్తికి తీవ్ర గాయాలు
NEWS Oct 13,2024 01:09 pm
మణుగూరు గుట్ట మల్లారం మూల మలుపు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గా కంపెనీకి చెందిన బొలెరో వాహనం బోల్తా కొట్టిందని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో దుర్గా కంపెనీ మేనేజర్ ముత్తుకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పెట్రోలింగ్ పోలీసులు స్పందించి గాయపడిన వ్యక్తిని మణుగూరు ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.