దేవీ నవరాత్రులు ఐక్యతను నింపుతాయి
NEWS Oct 13,2024 01:10 pm
అశ్వాపురం కోదండ రామాలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం మహా అన్నదానం కార్యక్రమాన్ని డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ప్రారంభించారు. దేవీ నవరాత్రులు అందరిలో ఐక్యతను, ఎప్పటికప్పుడు గుర్తు చేయడానికి దోహదపడుతుందని చెప్పారు. అమ్మవారి దయవల్ల ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.