కోటమైసమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు
NEWS Oct 13,2024 01:15 pm
సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలో కోట మైసమ్మ తల్లి జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వారిని సత్కరించారు.