సరస్వతి ఆలయ చైర్మన్ మృతి
NEWS Oct 13,2024 10:49 am
మల్యాల మండలం నూకపల్లి గ్రామంలోని సరస్వతి ఆలయ చైర్మన్ అంగళి రాజం (49) శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందారు. రాజం మృతితో నూక పెళ్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి, పలువురు నాయకులు, భక్తులు రాజం ఆలయానికి చేసిన సేవలను స్మరించుకుంటూ, సంతాపం ప్రకటించారు.