HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి అధ్యక్షతన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దత్తాత్రేయ ఢంకా మోగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత విశిష్ట అతిథిగా పాల్గొన్న రేవంత్ ప్రసంగిస్తూ, ఈ వేడుక సంప్రదాయం తప్ప, రాజకీయాలతో సంబంధం లేదని కొనియాడారు. పలువురు గవర్నర్లు, సీఎం చంద్రబాబు, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు.