విలీన సభను జయప్రదం చేయాలి
NEWS Oct 13,2024 09:11 am
14 రాష్ట్రాల్లో సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న TUCIలో IFTU విలీన సభను జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి కార్మికులను కోరారు. ఆదివారం మణుగూరు IFTU కార్యాలయంలో విలీన సభకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరణ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నేడు కార్మిక వర్గంపై దాడి తీవ్రమవుతుందని అన్నారు. ఆయా దేశాల ఆర్థిక సంక్షోభాల పర్యవసానాల్లో శ్రమ శక్తులపై ప్రతాపాన్ని చూపిస్తున్నాయని తెలిపారు.