ఆ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి
NEWS Oct 13,2024 08:23 am
బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ భూక్య సాగర్ నాయక్ ఆత్మహత్యయత్నానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ అధికారులు తనను గంజాయి కేసులో ఇరికించారని చెప్పారు. అవమానంతో మనస్థాపానికి గురై పురుగుమందు సేవించి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడని తెలిపారు. అతన్ని ఇబ్బంది పెట్టిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.