పిల్లలను బావిలో తోసేసి తండ్రి ఆత్మహత్య
NEWS Oct 13,2024 08:19 am
కామారెడ్డి జిల్లాలో దసరా పండుగ పూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో సహా వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తొలుత బావిలో ఇద్దరి పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. కొంత సేపటి తర్వాత ఆ ఇద్దరి పిల్లల తండ్రి మృతదేహాన్ని కూడా గజ ఈతగాళ్లు వెతికి బయటకు తీశారు. ఆత్మహత్యకు కారణం కుటుంబ కలహాలే అని తెలుస్తోంది.