రామాజీపేట గ్రామస్తుల ధర్నా
NEWS Oct 13,2024 08:15 am
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట గ్రామస్తులు రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం మొదలైంది. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు తమపై దాడులు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఓ వర్గం ధర్నా చేపట్టింది. పోలీసులు సర్దిచెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ ధర్నా కొనసాగించారు. రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.