17 గంటలపాటు శబరిమల దర్శనం
NEWS Oct 12,2024 07:39 am
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం భక్తులకు ఇకపై 17 గంటల పాటు అందుబాటులో ఉండనుంది. మండలం మకరవిళక్కు సీజన్ను పురస్కరించుకుని ఉదయం 3 నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. దర్శనానికి వచ్చే భక్తులంతా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.