పల్లెప్రకృతి వనంలో చెట్లు తొలగింపు
NEWS Oct 12,2024 07:32 am
మేడిపల్లి మండలం పసునూర్ గ్రామంలోని పల్లెప్రకృతి వనంలో చెట్లను నరికివేయటం చర్చకు దారితీసింది. గ్రామంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన పల్లె ప్రకృతి వనంలో చెట్లు ఏపుగా పెరిగాయి, కానీ ఈరోజు గ్రామపంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో అందులో ఉన్న సుమారు 15 నుంచి 20 చెట్లు నరికి వేయడం పలు విమర్శకు దారితీసింది. నీడ కోసం చెట్లను పెంచిన క్రమంలో అసలు పల్లె ప్రకృతి వనంలో చెట్లను ఎందుకు తొలగించారో తెలియదు.