దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
NEWS Oct 11,2024 03:17 pm
మెట్ పల్లి పట్టణంలోని మార్కెట్ యార్డులో దసరా ఉత్సవాలకు జమ్మి చెట్టు దగ్గర ఏర్పాట్లను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సి.ఐ నిరంజన్ రెడ్డిని కోరారు. కౌన్సిలర్లు బంగారు కాళ్ళ కిషోర్, మున్సిపల్ డిఈ నాగేశ్వరరావు, సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, సాగర్, రాజు, ప్రవీణ్, తదితరులు ఉన్నారు.