రెవెన్యూ, పోలీస్ శాఖ సీజ్ చేసి నిల్వ ఉంచిన సుమారు 25 ట్రాక్టర్ల ఇసుకను మెట్పల్లి తాహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఈ నెల 16న వేలం ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు అదే రోజు ఉదయం 11 గంటలకు వచ్చి రూ.10,000 ధరావత్తును తహశీల్దార్ కార్యాలయంలో చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని కోరారు.