దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
NEWS Oct 11,2024 03:23 pm
దసరా పండుగను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రత పరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చట్టానికి లోబడి నడుచుకోవాలని కోరారు. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దసరా పండుగను, దుర్గ నిమజ్జన ప్రక్రియను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని అందుకు ప్రజలు పూర్తిగా పోలీసు వారికి సహకారం అందించాలని కోరారు.