సిద్ది దాత్రి అవతారంలో అమ్మవారు
NEWS Oct 11,2024 03:14 pm
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాలేజి గ్రౌండ్ సమీపంలో శ్రీదుర్గా దేవాలయం వారి ఆధ్వర్యంలో శుక్రవారం 9వ రోజు శ్రీ మహా సిద్ది ధాత్రి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా అమ్మవారి సన్నిధానంలో దేవి నిత్య పూజ, కుంకుమార్చన, మహా చండీయాగం, విశేష పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు.