ఇందిరమ్మ ఇళ్ల కమిటీపై జీవో విడుదల
NEWS Oct 11,2024 12:33 pm
ఇందిరమ్మ ఇళ్ల కమిటీల జీవోను విడుదల చేసింది. గ్రామపంచాయితీల్లో, మున్సిపల్ వార్డు స్థాయిల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తారు. గ్రామస్థాయిల్లో సర్పంచ్ /ప్రత్యేక అధికారి చైర్ పర్సన్ ఉండగా.. మున్సిపాలిటీ స్థాయిల్లో కౌన్సిలర్ / కార్పొరేటర్ చైర్ పర్సన్ గా ఉంటారు. కన్వీనర్ గా పంచాయితీ కార్యదర్శి, వార్డ్ ఆఫీసర్ ఉంటారు. కమిటీలో ఇద్దరు ఎస్ హెచ్జీ సభ్యులు, ముగ్గురు స్థానికులు ఉంటారు. ఈ కమిటీలు ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు అవగాహన కల్పించడంతోపాటు, అనుమానాలు నివృత్తి చేస్తారు.