మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ కిరణ్
NEWS Oct 11,2024 11:21 am
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. ఎస్పీ మహాముత్తారం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసులు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. మండలంలో మావోయిస్టులు ఎలాంటి చర్యలకు దిగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.