రెడ్డి జనసంక్షేమ సంఘం వినతి పత్రం
NEWS Oct 11,2024 11:22 am
కథలాపూర్ రెడ్డి జన సంక్షేమ సంఘ సభ్యులు శుక్రవారం ఎస్ఐకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ఎస్సారెస్పీ వరద కాలువ ఆనుకొని ఉన్న 109వ సర్వే నెంబర్ గత 10 సంవత్సరాల నుండి కబ్జాలో ఉన్నామని, దానికి ఫెన్సింగ్, బోరు వేసుకున్నామని, కానీ ఇప్పుడు దుంపేట గ్రామ సభ్యులు తమ భూమిని ఆక్రమించుకోవడానికి చూస్తున్నారని, మా సంఘ భవనం ఏర్పాటు చేసుకోవడానికి నిర్మించిన ఫెన్సింగ్ ని JCB తో తీసివేశారని, 2.10 గుంటల భూమిని చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నామని, దానిపై ఎస్ఐ విచారించాలని కోరారు.