పుణ్యతిధికి ముస్తామబవుతున్న సాయిబాబా ఆలయం
NEWS Oct 11,2024 11:18 am
రెండవ షిర్డీగా పేరుగాంచిన కోరుట్ల పట్టణంలో సాయిబాబా ఆలయంలో దసరా తర్వాత రోజు జరిగే సాయిబాబా పుణ్యతిధి వేడుకలకు ముస్తాబవుటోంది. ఏటా దసరా తర్వాత మరుసటి రోజు సాయిబాబా ఆలయంలో వేడుకలు చేస్తారు. ఈ వేడుకలకు నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఏటా సుమారు 20 వేల మంది హాజరవుతారు. ఈ వేడుక కోసం ఆలయ పాలకవర్గం ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు.