మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు
NEWS Oct 11,2024 11:15 am
దేవీ నవరాత్రుల సందర్భంగా మల్యాల మండల కేంద్రంలోని కొత్తపేట నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో కొలువుదీరిన అమ్మవారు శుక్రవారం మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, మహదాశీర్వచనం అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భవానీలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.