గీతాకార్మికులకు సేఫ్టీ మోకులు
NEWS Oct 11,2024 09:26 am
వరంగల్ జిల్లా నర్సంపేటలో గీతాకార్మికులకు సేఫ్టీ మోకులు (కాటమయ్య రక్షణ కవచం) MLA దొంతి మాధవ రెడ్డి అందించారు. MLA క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 200 మందికి సేఫ్టీ మోకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పుష్పలత రెడ్డి, శంకరయ్య, అబ్కారి సూపర్ డెంట్ మురళీధర్, CI నరేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, 6 మండలాల గీతాకార్మికులు పాల్గొన్నారు.