అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
NEWS Oct 11,2024 08:32 am
చిన్న శంకరంపేట: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. సుమారు 1,8 కిలోల వెండి, 5 తులాల బంగారం, ఇత్తడి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దేవాలయాలను టార్గెట్ గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేసు చేదించిన పోలీసులను ఆయన అభినందించారు.