టేక్మాల్ మండల కేంద్రంలోని శ్రీ కాళికాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గ మాత అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. పూజారి సుదీర్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకుల సారధ్యంలో గ్రామ మహిళలు సామూహిక కుంకుమార్చన పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.