ప్రముఖ వ్యాపారవేత్త టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా మరణం పట్ల ఎన్డీఏ మహాకూటమి నాయకులు సంతాపం తెలిపారు. గొల్లపూడిలోని దత్త కళ్యాణ మండపంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం సంధర్భంగా స్థానిక MLA వసంత వెంకట కృష్ణప్రసాదుతో పాటు, మాజీమంత్రి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్(రాజా), విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం శ్రద్దాంజలి ఘటించారు.